బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
Thu Jun 12, 2025 07:00 India
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే చెన్నై-మైసూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా గుండా దూసుకెళ్లనున్న విషయం జిల్లా ప్రజలకు గర్వకారణంగా మారింది. ఈ హైస్పీడ్ రూట్కి జిల్లాలో ప్రత్యేక స్థానం లభించనుండగా, పలమనేరు, బంగారుపాళెం, చిత్తూరు నియోజకవర్గాల మీదుగా మొత్తం 77 కి.మీ మేర ఈ మార్గం సాగనుంది. మైసూరు నుండి చెన్నై వరకు 463 కి.మీ దూరం ఉన్న ఈ మార్గానికి సంబంధించి ఫీల్డ్ వర్క్, సోషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (SIA), రీ సెటిల్మెంట్ యాక్షన్ ప్లాన్ (RAP) పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) జీఎం నిషాంత్ సింఘాల్ సూచనలు పంపినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ ప్రాజెక్టులో జిల్లాలోని 41 గ్రామాలు భాగమవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు నుంచి బైరెడ్డిపల్లి మండలంలోని కంభంపల్లి మొదలుకొని, ఆలపల్లి, జీసీపల్లి, లక్కనపల్లి, శెట్టిపల్లి, బెలుపల్లి, అంకింవారిపల్లి, అయ్యంరెడ్డిపల్లి, గుండ్లపల్లి, కొలమాసనపల్లి, మొరం, జల్లిపేట, కూర్మాయి, పలమనేరు, సముద్రపల్లి, పెంగరగుంట, మొగిలి, టేకుమంద, గొల్లపల్లి, రాగిమానుపెంట, బోడబండ్ల, బుడితిరెడ్డిపల్లి, యాదమరి, పెరియంబాడి, మాధవరం, కొత్తపల్లి, వసంతాపురం, బసవపల్లి, కుప్పిగానిపల్లి, రాగిమానుపట్టెడ వంటి గ్రామాల మీదుగా ఈ మార్గం తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఇది జిల్లాకు సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేయనుంది.
ఈ గ్రామాల్లో 876 మంది రైతుల భూములను సేకరించనున్నారు. జిల్లాలో ఒక్కటే.. మైసూరు నుంచి చెన్నై దాకా మొత్తం తొమ్మిది చోట్ల స్టాపింగ్ లు ఉన్నాయి. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో 5, తమిళనాడులో 3 చోట్ల బుల్లెట్ ట్రైన్ ఆగుతుంది. చిత్తూరు జిల్లాలో మాత్రం 190- రామాపురం వద్ద మాత్రమే చిత్తూరు జిల్లా స్టాపింగ్ పెట్టారు.
ఇది కూడా చదవండి: తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #BulletTrain #ChennaiMysuruBulletTrain #HighSpeedRail #NHSRCL #ChennaiToMysuru #BulletTrain #ChennaiMysuruBulletTrain #HighSpeedRail #NHSRCL #ChennaiToMysuru
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.